కడప జిల్లా రాజంపేట మార్కెట్ యార్డ్ లో మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాధ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదానం చేశారు. రాజంపేట నియోజకవర్గం రైతులే కాకుండా రైల్వే కోడూర్ నియోజకవర్గం పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండలాలకు సంబంధించిన అనేకమంది రైతులు పండించిన పంటలను అమ్ముకొనేందుకు రాజంపేట మార్కెట్ యార్డ్ వస్తూ ఉన్నారు.
అలా వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వారికి రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన గత రెండు వారాలుగా మార్కెట్ యార్డులో రైతులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య క్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిళ త్రినాధ్, వైస్ ఛైర్మన్ భాస్కర్ రాజు, దాసరి పెంచలయ్య, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.