నూతన సంవత్సరం (2021) సందర్భంగా విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, యువనేత పటోళ్ల కార్తీక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలను కందూకూరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సామ మహేందర్రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ సంక్షేమానికై పనిచేయాలని, పార్టీ ప్రతిష్టతకు పనిచేస్తూనే నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటు నందించాలని సామ మహేందర్రెడ్డికి వారు సూచించారు.