ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. 3,335 పంచాయతీల సర్పంచ్లకు, 33,632 వార్డులకు రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మంగళవారం నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదో తేదీన పరిశీలన మొదలవుతుంది.
8న మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని అదే రోజు తుది జాబితాను ఖరారు చేస్తారు. 13వ తేదీ పోలింగ్ నిర్వహిస్తారు.
అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు సాయంత్రంగానీ, లేక మరుసటిరోజు ఉదయం గానీ ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు.