హైదరాబాద్ లోని సెయింట్ థెరిసా స్కూల్ లో పదో తరగతి చదువుతున్నముగ్గురు పాఠశాల విద్యార్థులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ రావు నగర్ కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఒకేసారి అదృశ్యం కావడంపై పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. ఓ లెటర్ రాసిపెట్టిన వెళ్లిన విద్యార్థులు ఆచూకీకై ప్రత్యేక బృందాలతో గాలిస్తూ,
వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోతమ బిడ్డలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు, అన్ని సీసీటీవీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు.