శ్రీకాకుళం జిల్లా లోని వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లు పేట గ్రామానికి చెందిన మత్స్య కారులు మహారాష్ట్ర లోని ముంబాయి దరి, మాధవ వంజెర, కోలివాడ దీవి లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మొత్తం 70 మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు.
వారికి తినేందుకు తిండి కూడా దొరకడం లేదని న్యాయవాది, డి.మత్స్య లేశం సాగర మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు చింతపల్లి సూర్యనారాయణ తెలిపారు. కొండా వెంకయ్య, వంకా హేమ రావు తో పాటు 70 మంది మత్స్యకారులు అక్కడ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన తెలిపారు. అక్కడి ప్రభుత్వం రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదని, వంటకి కావల్సిన వస్తువులు కొనేందుకు డబ్బులు కూడా లేవని వారు తెలిపినట్లు చింతపల్లి సూర్యనారాయణ అన్నారు.ఆ విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.