28.7 C
Hyderabad
April 27, 2024 05: 00 AM
Slider జాతీయం

భర్తా ఇద్దరు పిల్లలు ఉన్నా మేనల్లుడ్ని ప్రేమించిన అత్త

#love

ప్రేమ గుడ్డిది అని అంటారు. రాజస్థాన్‌లోని చురు జిల్లా సదర్ పోలీస్ స్టేషన్‌లో అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మైనర్ బాలుడు అతని 35 ఏళ్ల మేనత్త ప్రేమలో పడ్డాడు. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

ఈ విషయమై సదర్ పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. ఆమెతో 10 ఏళ్ల క్రితం తనకు వివాహమైందని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కరంగో బడా నివాసి అయిన తన మైనర్ మేనల్లుడు తన ఇంటికి తరచూ వచ్చేవాడని, ఈ క్రమంలో మేనత్త, మేనల్లుడి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని అతను వాపోయాడు.

చివరకు ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని కూడా అతను అంటున్నాడు. కొద్దిరోజుల క్రితం తన భార్య తన మేనల్లుడితో పెళ్లి చేసుకుందని కూడా అతడు పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు అతనితో సెటిల్ అవుతానని తన భార్య అంటున్నదని భర్త చెప్పాడు.

తన భార్య తనకు విడాకులు ఇవ్వలేదని అందువల్ల తన మేనల్లుడితో జరిగిన వివాహం చెల్లదని అతడు అటున్నాడు. ఈ విషయమై సదర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దని కుటుంబ సభ్యులు మహిళ, మైనర్ అబ్బాయిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ ఇద్దరూ కలిసి జీవించడానికి మొండిగా ఉన్నారు.

ఇద్దరూ కలిసి జీవిస్తామని లేకపోతే, చనిపోతామనిని ఆ మహిళ స్పష్టం చేసింది. తన భర్తతో వెళ్లేందుకు మహిళ నిరాకరించింది. మేనల్లుడితోనే ఉంటానని కూడా ఆమె కరాఖండిగా చెబుతున్నది.

Related posts

హేట్సాఫ్: పారిశుద్ధ్య కార్మికుల త్యాగం వెలకట్టలేనిది

Satyam NEWS

జైమేడారం:హుండీ ఆదాయం రూ.5.63 లక్షలు

Satyam NEWS

వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment