అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములని తీసుకువెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. ఈ మిషన్ కోసం12 మంది ఎంపిక చేసింది. భారత్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న నలుగురిని తుది జాబితాలోకి చేర్చింది.
ఈ నలుగురిలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. అయితే వీరంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. మానవ లక్షణాలు కలిగిన ఒక రోబోని కూడా వ్యోమగాముల వెంట పంపించనున్నారు. .