రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ ఫలితంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ది పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్డీఎఫ్ కింద 49.49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. నగరంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అజయ్ విజ్ఞప్తికి స్పందించి తక్షణమే 49.49 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు.
ఖమ్మం నగర అభివృద్ధికి ఎల్లపుడూ సహాయసహకారాలు అందిస్తూ, తాజాగా సీఎం కేసిఆర్ ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.