వైసీపీ ప్రభుత్వానికి మంత్రి వర్గ అసంతృప్తుల నుంచి అప్పుడే సెగలు తలుగుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జగన్ వేస్తున్న కులాల లెక్కలతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మేం రెక్కలు ముక్కలు చేసుకున్నాం.. ఇప్పుడు కులాలు.. మతాలు అంటూ.. మమ్మల్ని పక్కన పెడతారా? అని నిప్పులు చెరుగుతున్నారు.
దీంతో ఎవరిని విస్మరిస్తే ఏం జరుగుతుందో ఎలాంటి విమర్శలు ఎదురవుతాయో.. ఎలాంటి నిరసనలు చూడాల్సి వస్తుందో అని.. పార్టీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే , తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి ఏపీలో నూతన మంత్రి వర్గ విస్తరణ స్థానం దక్కకపోవడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు కు చెందిన బాలినేనికి అత్యంత సన్నిహితుడు భవనం శ్రీనివాసరెడ్డి, అతని భార్య భవనం శ్రీలక్ష్మి ప్రస్తుతం ఇంకొల్లు ZPTC గా వున్నారు. బాలినేని మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంతో ఆమె తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయునట్లు స్పష్టం చేశారు. ఇదే ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.