ఉత్తరాంద్రలో టీడీపీ బతికేఉందని నిరూపించింది….ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు పర్యటన. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు ఉన్న తన 21 గంటల వ్యవధి పర్యటనలో జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అలాగే రాబోయే ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తారో…సూటిగా ప్రజలకు అర్ధమయ్యేలా సుత్తి లేకుండా చంద్రబాబు చెప్పేసారు. చంద్రబాబు తిరుగు ప్రయాణంలో సుభద్రాపురం నుంచి ఎయిర్ పోర్టుకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందడం…ఆ రాత్రి అక్కడిక్కడే చంద్రబాబు తన కాన్వాయ్ మొత్తాన్ని ఆపి..దిగి ఘటాన స్థలికి వెళ్లి పరిశీలించి..అంబులెన్స్ ను పిలిపించి దగ్గరుండీ పంపించడం కొసమెరుపు. ఇక ఓవర్ ఆల్ గా చూస్తే…విజయనరగం జిల్లాలో చంద్రబాబు జరిపిన చేసిన పర్యటన..టీడీపీశ్రేణుల్లో ఉత్సాహాన్నే నింపింది.
చంద్రబాబు పర్యటనా విశేషాలు…..
ముందు రోజు రాత్రి ఒంటి గంటలకు భోగాపురం రిసార్ట్ కు చేరిన బాబు.
ఆ రోజు ఉదయమే సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందిని అలెర్ట్ చేసిన ఎస్పీ.
ఏఆర్ విభాగానికి చెందిన పోలీసులు అధికారులు చిరంజీవి, శేషాద్రి, నాగేశ్వరరావు లో కాన్వాయి.
13 వెహికల్స్ లో.రమారమి 150 సిబ్బంది…393 నెంబర్ తో చంద్రబాబుకు గట్టి భద్రత.
హైదరాబాద్ నుంచీ నేషనల్ సెక్యురిటూ (ఎన్.ఎస్.జీ) కమెండోస్ తో జెడ్ ప్లస్ సెక్యురిటీ
మొత్తం బాబు పర్యటన కవరేజ్ కు….మీడియాకు ఏసీ బస్సు ఏర్పాటు చేసిన పార్టీ.
ఉదయం 8 నుంచీ రాత్రి పది వరకు చంద్రబాబు పర్యటన కవరేజ్ లో మీడియా.
భోగాపురం నుంచీ బయలు దేరే సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న మీడియా బస్సు.
విజయనగరం దాసన్నపేట జంక్షన్ లో బాబు పర్యటనను కు వచ్చిన కొంత మీడియా
ఇచ్చిన సమయం కన్నా…దాసన్నపేటకు…రెండు గంటలు ఆలస్యం..
ప్రతీ చోట…కేటాయించిన సమయం కన్నా…ఎక్కువసేపు మాట్లాడిన చంద్రబాబు.
పోలీస్ శాఖ లో ఏఆర్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది క్షణం తీరిక లేకుండా బందోబస్తు.
విజయనరగంలో డీఎస్పీ త్రినాద్,..చీపురుపల్లిలో బొబ్బిలి డీఎస్సీ మో హన్ రావు
మీడియాకు కనిపించిన సీఐ మంగవేణి…ఎస్ఐలు నారాయణ ,కిరణ్, పద్మావతిలు,
దాసన్నపేట, రామతీర్ధం జంక్షన్,చీపురుపల్లిలో ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు.
నగరంలోని పూల్ బాగ్ వద్ద డ్రెస్ మార్పుకోసం…గంట సేపు కాన్వాయి్ నిలుపుదల
రాత్రి ఏడుగంటల ప్రాంతంలో గుజ్జింగవలస వద్ద ట్రాపిక్ జామ్…ముందుకెళ్లిన కాన్వాయి.
ఎట్టకేలకు చీపురుపల్లి రోడ్ షోకు..కాన్వాయి ముందుకు వచ్చిన మీడియా…
దాసన్నపేట వద్ద అశోక్ గజపతిరాజు కూతురు ఆదితో మాట్లాడించిన చంద్రబాబు.
చీపురుపల్లిలో బాబు చెప్పకుండానే మైక్ తీసుకున్న టీడీపీ నేత నాగార్జున
ఇద్దరిని గెలిపించాలంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.
చీపురుపల్లి రోడ్ షో లో..సెల్ ఫోన్ యుగాన్ని తెచ్చింది తానేనంటూ..ఫోన్ లో లైట్ వేయించిన బాబు.
మూడు చోట్ల చెప్పిందే చెప్పిన టీడీపీ అధినేత.
మీడియా ఓపెన్ టాప్, భోజన వ్యవస్థ సమకూర్చిన విజయనగరం పార్టీ కార్యదర్శి కంది
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం