గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసిల్దార్ గా సుజాత గురువారం తిరిగి బాధ్యతలు చేపట్టారు.
రెండు నెలల సెలవు అనంతరం ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. సుజాత సెలవులో వెళ్లడంతో నాదెండ్ల తహసిల్దార్ మల్లికార్జునరావు ఇప్పటి వరకు ఇన్ ఛార్జి తహసిల్దార్ గా పని చేశారు. ఇకపై మల్లికార్జున రావు నాదెండ్ల తహసిల్దార్ గానే కొనసాగనున్నారు.
రెండు మండలాలకు రెండు నెలలుగా ఒకే తాసిల్దార్ పని చేస్తున్నారని ఇటీవల సత్యంన్యూస్.నెట్ ప్రత్యేక కథనం పోస్టు చేసిన విషయం తెలిసిందే.
దీనివల్ల రెండు మండలాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూడా సత్యం న్యూస్ తన కథనంలో పేర్కొన్నది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో తగిన చర్యలు తీసుకున్నారు.