తల్లిదండ్రులు పోగొట్టుకున్న అమ్మాయిని హాస్టల్లో ఉంచి చదివిస్తామని మాయ మాటలతో నమ్మించి తీసుకెళ్లి న గుర్తు తెలియని వ్యక్తులు వ్యభిచార కూపంలో దించారు. అమ్మాయికి తెలియకుండానే పని పేరిట వ్యభిచార నిర్వాహకులకు అమ్మేశారు.
అమ్మాయి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆరు సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో అమ్మాయి అదృశ్యం కేసు నమోదు కూడా అయింది. రహస్యంగా తన మామయ్య కు ఫోన్ చేసి అసలు విషయాన్ని ఆ యువతి చెప్పింది.
దాంతో పోలీసుల సహకారంతో సిరిసిల్ల ప్రేమ్ నగర్ లోని వేశ్య గృహం నుంచి యువతి ని విడిపించుకున్నారు. యువతి మామయ్య రాజలింగం కు పోలీసులు ఆ అమ్మాయిని అప్పగించారు.