ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులోని సిలువ గిరి కొండపై ఒక వ్యక్తి ని బీరు సీసాలతో పోడిచి దారుణ హత్య చేసిన ఘటన జరిగింది. హత్య కు గురైన వ్యక్తి కంచికచర్ల మండల కీసర గ్రామానికి చెందిన కుర్రాకుల వెంకటేశ్వరరావు(35)గా సమాచారం. నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన కుర్రాకుల వెంకటేశ్వరరావు తిరిగి రాలేదు. ఐతవరం వద్ద ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాఫీలో సెక్యూరిటీ గార్డుగా అతను విధులు నిర్వహిస్తున్నాడు. పెండ్యాల గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తి కి డబ్బులు ఇవ్వాలనే కారణంతో ఈ హత్య చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.
previous post
next post