సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పోలీసులకు కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ లలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి 50 రెడ్ క్రాస్ మాస్కులు, ప్రతి పోలీసు స్టేషన్ కు 100 సర్జికల్ మాస్కులు,5 లీటర్ల శానిటైజర్ క్యాన్లను హుజుర్ నగర్ CI రాఘవరావు నేతృత్వంలో అందజేశారు.
ఈ సందర్భంగా CI మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో విధిగా భాద్యతలు నిర్వర్తిస్తున్న హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ కు ఐదు లీటర్ల శానిటైజర్, ఐదు వందల మాస్కులు కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీపతి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్లు,పోలీసుల కుటుంబాలు కరోనా బారిన పడితే వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం కల్పించాలని, నష్టం జరిగితే ఎక్సగ్రేషియా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటనారాయణ,డాక్టర్ కెప్టెన్ శ్రీపతి, జగిని ప్రసాద్, హుజుర్ నగర్ ఎస్ఐ కట్టా వెంకట రెడ్డి, హుజుర్ నగర్ పోలీసు సర్కిల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.