40.2 C
Hyderabad
April 29, 2024 17: 19 PM
Slider హైదరాబాద్

ఇన్స్టా చేస్తూ యువకుడి మృతి

#Ins Sta Reels

హైదరాబాద్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇన్స్ స్టా రీల్స్ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు పొగుట్టుకున్నాడు. వివరాల ప్రకారం.. నగరంలోని రెహ్మత్ నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు ఇన్ స్టా రీల్స్ చేసేందుకు సనత్ నగర్ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లారు. అనంతరం ఇన్ స్టా రీల్స్ చేస్తూ రైలు రాకను సరిగ్గా గమనించకపోవడంతో మహ్మద్ సర్ఫరాజ్‌ను (16) రైలు ఢీకొట్టింది.

దీంతో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహ్మద్‌ సర్ఫరాజ్‌ను రహ్మత్ నగర్‌ వాసిగా పోలీసులు గుర్తించారు.

Related posts

కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ అయిన నీలం సహానీ

Satyam NEWS

తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ప్రకట‌న

Sub Editor

ఆదిలాబాద్ అడవుల్లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో

Satyam NEWS

Leave a Comment