జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.
ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు.
మల్లాపూర్లోని ఓ హోటల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఆమె అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.
ఈ నేపథ్యంలో డీఈ మహాలక్ష్మి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.