అలనాటి అగ్ర హీరోయిన్, నేటి ఏపి మంత్రి ఆర్ కె రోజా కుమార్తె అన్షు మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నదా? ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం జరిగిందని తెలిసింది. తమిళ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తో అన్షు మాలిక హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలిసింది. కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని కోలీవుడ్ లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే టాలీవుడ్ నిర్మాణ సంస్థ అన్షును లాంచ్ చేయనుంది.
ఆమె కోసం అనేక కథలను సిద్ధం చేసింది. హీరోగా ధ్రువ్ విక్రమ్ అయితే సరిపోతాడని ప్రొడక్షన్ హౌస్ భావించిందట. అతడికి కథను వినిపించి సినిమాలో నటించాలని కోరగా అంగీకరించినట్టు సమాచారం. మేకర్స్కు అజయ్ జ్ఞానముత్తు వర్క్ చాలా బాగా నచ్చింది. అందువల్ల దర్శకుడిగా అతడిని ఎంపిక చేసుకున్నారు. రోజా కుమార్తె అన్షు మాలిక విషయానికి వస్తే.. ఆమె చాలా పుస్తకాలను రాసింది. పలు అవార్డులను కూడా గెలుపొందింది. జీవితానుభావాలకు ఎక్కువగా తన పుస్తకాల్లో చోటిస్తుంది. పలు మ్యాగజైన్ కవర్ పేజెస్పై ఫిక్షనల్ రైటర్గా దర్శనమిచ్చింది.