మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఉదయం నుండే సోదాలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఏక కాలం లో పళని బంధువుల ఇంట్లో కూడా ఏసిబి అధికారులు సోదాలు చేశారు. గతంలో అబ్దుల్లా పూర్ మెట్టు సబ్ రిజిస్ట్రారు గా ఆమె పనిచేశారు.
previous post