ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి ఆవుల సుజాత దేవి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. 30,000 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఆమె పట్టుబడ్డారు. పంచాయతీ పనులకు సంబంధించిన నిధులు చెల్లించాలంటే 30వేలు లంచం కావాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతో ఏసీబీ వలపన్ని దాడి చేసింది. ఈ దాడిలో లక్కవరం పంచాయతీ కార్యదర్శి ఆవుల సుజాత దేవి రెడ్ హాండెడ్ గా దొరికారు.