40.2 C
Hyderabad
April 29, 2024 17: 23 PM
Slider కరీంనగర్

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Rajeev Rahadaari

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ – రామకృష్ణ కాలనీ గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో ఈ దారుణ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు మరణించారు. మృతులను మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

కారులో ప్రయాణిస్తున్న నలుగురి పేర్లు వెల్లడయ్యాయి వారు స్వరాజ్, శివ, శేఖర్, .ప్రణయ్ కుమార్ గా చెప్తున్నారు. ప్రమాద స్థలాన్ని కరీంనగర్ రూరల్  ఏసీపీ విజయసారధి పరిశీలించారు. ఆయనతో బాటు సీఐ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

రెండుకోట్ల రూపాయలకు దివాళా పిటిషన్

Murali Krishna

‘14 డేస్ లవ్’లోని ‘ఏమ్ మాయో చేసేసి’ లిరికల్ సాంగ్ విడుదల

Bhavani

Leave a Comment