స్థిరాస్థి వ్యాపారంలో నష్ట పోయానంటూ ఖమ్మం నగరానికి చెందిన దొంతెబోయిన నాగేశ్వర్ రావు రెండు కోట్ల ఆరు లక్షల డెబ్భై వేల రూపాయలకు గాను 19 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ సీనియర్ సివిల్ జడ్జి, ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశారు. స్థిరాస్థి వ్యాపారం చేసేందుకు అప్పులు చేయాల్సివచ్చిందని, వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడం, అప్పులు ఇచ్చిన వారు తన పరిస్థితిని గమనించి ఎక్కువ వడ్డీలు డిమాండ్ చేయడం, అప్పులు ఇచ్చిన వారి వత్తిడి ఎక్కువ కావడంతో దివాళా పిటిషన్ దాఖలు చేసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున దొంతెబోయిన రామారావు అడ్వకేట్ గా వ్యవహరిస్తున్నారు.
previous post