39.2 C
Hyderabad
April 28, 2024 13: 16 PM
Slider విశాఖపట్నం

దిండుతో అదిమి పెట్టి వృద్ధ దంపతుల దారుణ హత్య

vizag murder

విశాఖపట్నంలో దారుణం జరిగిపోయింది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పారిపోయారు. పెందుర్తి నియోజకవర్గం నరవ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మృతులను ఆర్టీసి విశ్రాంత ఉద్యోగి జెర్రిపోతుల సముద్రాలు, ఆయన భార్య పార్వతీ గా పోలీసులు గుర్తించారు. ఈ వృద్ధ దంపతుల మొహంపై దిండుతో అదిమిపెట్టి హత్య చేశారు.

ముక్కు,నోరు మూసి ఊపిరాడకుండా చేయడంతో వారు మరణించారని అనుమానం. డబ్బు,బంగారం కోసం వీరిని హతమార్చినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

లాక్ డౌన్ ఉన్నా రైతులకు ఇబ్బందులు లేవు

Satyam NEWS

కరోనాను జయించిన పేషంట్స్ కు వీడ్కోలు

Satyam NEWS

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Satyam NEWS

Leave a Comment