తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు కె. అచ్చెన్నాయుడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం కనిపిస్తున్నది.
మే నెలలో జరిగిన మహానాడులోనే ఈ ఎంపిక పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా అది జరగలేదు. పార్టీ సీనియర్లలో ఎక్కువ మంది అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతున్నారు.
పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తిచేసింది. ఇకపై లోక్సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తిచేశారు.
వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తిచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.