మాజీ మంత్రి, టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ ఎస్ ఐ కేసులో అరెస్టు అయిన ఆయనకు ఇటీవల కరోనా సోకింది.
దాంతో ఆయనను మంగళగిరి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ కు తరలించారు. నిన్న ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటీవ్ వచ్చింది.
ఈ ఎస్ ఐ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నేరుగా స్వగ్రామం నిమ్మాడకు వెళ్లారు.