బాపట్ల జిల్లా మార్టూరు సీఐతో పాటు మరో ముగ్గురు ఎస్సైలపై వేటు పడింది. ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు రావడంతో వారిని విఆర్ కు పంపు. విఆర్ కు పంపిన వారిలో మార్టూరు సిఐ ఫిరోజ్, పర్చూరు ఎస్సై చెంచుప్రసాద్, మార్టూరు ఎస్సై కమలాకర్, యద్దనపుడి ఎస్సై ఆనోక్ లు ఉన్నారు. యద్దనపూడి ఆనోకు కొద్ది రోజుల క్రితమే విఆర్ కు బదిలీ అయ్యారు. పర్చూరు ఇంచార్జిగా యద్దనపూడి ఎస్సై, మార్టూరు ఇంచార్జిగా బల్లికురవ ఎస్సైలకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పోలీసు ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.