42.2 C
Hyderabad
May 3, 2024 15: 13 PM
Slider ఆధ్యాత్మికం

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి

#Malayappa Swamy

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం శ‌నివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామి వారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.

 ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ  అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారిగా రుక్మిణీభాయి

Satyam NEWS

మోడీది మేక్ ఇన్ ఇండియా కాదు సేల్ ఇండియా

Satyam NEWS

వెరైటీ ప్రోగ్రాం: బాలక్ భీమ్ బనో పోస్టర్ విడుదల

Satyam NEWS

Leave a Comment