మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ దాడి చేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తూర్తి లో 112 ఎకరాలకు ఎన్. ఓ. సీ. జారీ చేసేందుకు ఎకరాకు లక్ష చొప్పున కోటి 12 లక్షలు ఆయన డిమాండ్ చేశారు. దాంతో మూర్తి అనే రైతు అవినీతి నిరోధక శాఖ వారికి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ సోదాలు చేపట్టింది. డీ ఎస్ పీ లు సూర్యనారాయణ, ఫాయజ్, ఆరుగురు సీ ఐ ల ఆధ్వర్యంలో మెదక్ మండలం మాచవరం లోని అడిషనల్ కలెక్టర్ నాగేష్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో, హైదరాబాద్ లో మొత్తం 12 చోట్ల ఏ సీ. బీ అధికారుల తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఇంట్లో లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
మాచవరం లో అడిషనల్ కలెక్టర్ నగేష్ ను ఏ సీ బీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.