400 రోజులు,4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు బందోబస్తు అడిగితే మీరే చేసుకోవాలని చెప్పిన దిక్కు మాలింది..ఈ జగన్ ప్రభుత్వమని. విజయనగరం లో టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, కంది మురళీ నాయుడు, తెలుగు యువత నేతలు దుయ్యబట్టారు.
కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ .నగరంలో ని కోట జంక్షన్ వద్ద డెంకాషవలీ బాబ దర్గా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పసుపు రంగు బెలూన్ లను గాలిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం లో ప్రతీ ఒక్కరూ తమ హక్కుల ను తెలుపుకోవచ్చని..అందుకు ముందు గా ప్రభుత్వం నుంచీ అనుమతి పొందాలని..ఆ విధంగా నే టీడీపీ ..జగన్ ప్రభుత్వం ను కోరినా..
మీ పాదయాత్ర.. మీరే బందోబస్తు పెట్టుకోవాలని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని ఆరోపించారు. నాటి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పకి ముందే… స్వర్గీయ ఎన్టీఆర్ పాదయాత్ర కు శ్రీకారం చుట్టారని.. ఆ తర్వాత అందరూ ఆ ఫార్ములా పాలో అయ్యే..సీఎం పీఠాలను అధిరోహించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు .
ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలు ,కష్టాలు తెలుసుకునేందుకే…నారా లోకేష్.. కుప్పం నుంచీ ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కు శ్రీకారం చుట్టారని నేతలు పేర్కొన్నారు.