ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్రి గ్రామ సర్పంచ్ పెందూర్ లక్ష్మణ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన అకాల మరణం చెందడంతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
సాజిద్ ఖాన్ తో పాటు మాజీ కౌన్సిలర్ ముర్తుజా, MA షకీల్ లు కూడా ఉన్నారు. తన స్నేహితుడైన పెందూర్ లక్ష్మణ్ ఇలా అకాల మరణం చెందడం చాలా బాధగా ఉందని సాజిద్ ఖాన్ అన్నారు.
పెందూర్ లక్ష్మణ్ సర్పంచ్ గా ఎనలేని సేవలనందించారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల కోసం పాటుపడే. వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నానని అన్నారు.