42.2 C
Hyderabad
April 30, 2024 15: 34 PM
Slider జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

#Parliament

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మణిపూర్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.

దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన అనంతరం సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. మణిపూర్‌ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Related posts

కరోనాతో ఆసుపత్రిలో చేరిన చిరంజీవి అల్లుడు

Satyam NEWS

భారీ హోర్డింగ్ లతో ప్రచారం

Murali Krishna

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

Satyam NEWS

Leave a Comment