మనదేశంలో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది కేరళలోనే.. ఇక్కడ రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనిని నోరో వైరస్ అంటారని వైద్యులు చెప్పారు.
ఈ వైరస్ రెండు వారాల క్రితం వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్లోని వెటర్నరీ కళాశాలో వెలుగులోకి వచ్చింది. గత 15 రోజుల వ్యవధిలో 13 మంది విద్యార్థులకు నోరోవైరస్ ఇన్ఫెక్షన్ సోకిందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిందని.. అయితే నోరో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్ను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.