పాకిస్థాన్లోని స్వాత్ లోయలో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పుంజుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. స్వాత్ లోయలోని చార్బాగ్ తహసీల్లో ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థుల వ్యాన్పై దాడి జరిపారు. ఈ దాడిలో డ్రైవర్ చనిపోయాడు.
ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు. బాధిత కుటుంబం చార్బాగ్లో ధర్నాకు దిగిన తర్వాత, వారి మద్దతుదారులు ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో వీధుల్లోకి వచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ నినాదాలు చేశారు. స్థానిక నాయకుడు మంజూర్ పష్తిన్ మాట్లాడుతూ భద్రతా బలగాలు ఉన్నప్పటికీ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) స్వాత్ లోయలోకి చొరబడటం చాలా విచిత్రంగా ఉందని అన్నారు.
ఈ ధర్నాలో మరణించిన డ్రైవర్ బంధువులే కాకుండా మరికొందరు స్థానికులు కూడా పాల్గొన్నారు. వారిలో ఒకరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డ్రైవర్ వారసులకు ఉగ్రవాద బాధితులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇస్తామని డిప్యూటీ కమిషనర్ అంగీకరించారని తెలిపారు.
అదే సమయంలో, స్వాత్ ప్రాంతం మొత్తంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తామని, తద్వారా భవిష్యత్తులో ఉగ్రవాద కార్యకలాపాలు అరికట్టవచ్చని వారు తెలిపారు. పాకిస్థాన్లోని స్వాత్ ప్రాంతం అనేక దశాబ్దాలుగా ఉగ్రదాడులకు గురవుతోంది.
ఒకానొక సమయంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇతర రాడికల్ ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థలు ఇక్కడ తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు వాళ్లు అప్పటిలా బలంగా లేరు. అయితే తాజాగా జరుగుతున్న సంఘటనలు మళ్లీ తల ఎత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఉగ్రవాదంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అందుకే 1200 పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు.