38.2 C
Hyderabad
April 29, 2024 20: 02 PM
Slider నల్గొండ

మున్నూరు కాపు సంఘం కమిటీ అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు

#munnurukapu

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు  ఎన్నికైయ్యారు. హుజూర్‌నగర్  పట్టణంలోని రహదారి బంగ్లాలో సోమవారం జరిగిన మున్నూరు కాపు సంఘం నేతలు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టాకిషోర్ కుమార్,నియోజకవర్గ కో- ఆర్డినేటర్ పాలేటి రామారావు మాట్లాడుతూ  మున్నూరు కాపులు సంఘటితంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని అన్నారు.సంబండ వర్గాలకు రాజ్యాధికారం అందించే దిశగా మున్నూరు కాపులు బలమైన శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. నియోజకవర్గ కేంద్రాల్లో కాపు భవనాలకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు.కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా పేద కుటుంబాలకు ఋణ సౌకర్యం కల్పించాలని అన్నారు.

మాజీ ఎంపిపి పాలేటి రామారావు మున్నూరు కాపు సంఘం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శాసనాల నాగ సైదయ్య,ఉపాధ్యక్షుడు కామిశెట్టి వెంకటేశ్వర్లు,ఆర్గనైజింగ్ సెక్రటరీ కాసర్ల నాగేశ్వర్రావు,కాల్వ పెద్ద వెంకటేశ్వర్లు,కార్యదర్శులు కాల్వ సత్యనారాయణ,ఆవుల వెంకటయ్య, కోశాధికారి కడియం శ్రీనివాసు,కమిటీ సభ్యులు తోట నర్సింహారావు,ఆవుల నరేంద్రబాబు,మధు,తోట యలమందయ్య ఎన్నికైనట్లు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగం

Satyam NEWS

అధికారుల‌తో టిటిడి అద‌న‌పు ఈవో స‌మీక్ష‌

Satyam NEWS

మాదక ద్రవ్యాలపై మరిన్ని కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment