తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లో చేపట్టిన మహా రైతు ధర్నా సెగ ఢిల్లీకి తాకిందని, నల్ల చట్టాలతో రైతుల వెన్ను విరిస్తుంటే సిఎం కెసిఆర్ చూస్తూ ఊరుకోరని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సైదిరెడ్డి మాట్లాడుతూ రైతులు సుఖశాంతులతో ఉండాలని రైతుబంధు, రైతుభీమ, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లాంటి గొప్ప పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతుందని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని,దానికోసం సిఎం కెసిఆర్ ఇచ్చే ప్రతి పిలుపుకి స్పందించి పోరాటం చేస్తూనే ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్