గద్వాల జోగులాంబ జిల్లా పరిధిలోని అలంపూర్ నియోజకవర్గ ఐజ మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమల్ రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి స్వగ్రామం ఉత్తనూర్ లో ఏర్పాటుచేసిన అంత్యక్రియల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముందుగా ప్రజల సందర్శనార్థం గ్రామంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వారి భౌతికకాయాన్ని ఉంచారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివిధ ప్రజా ప్రతినిధులు కలిసి వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని తాను చనిపోతూ కూడా పలువురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవ దానం చేయడం ఎంతో గొప్ప విషయమని వారు అన్నారు.
వారి అకాల మరణం ఎంతో కలచివేసిందని వారి మరణం స్థానిక ప్రజలకే కాక జిల్లా ప్రజలకే తీరని లోటని వారు తెలిపారు. వారి మరణం పట్ల తీవ్ర ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు వారితో పాటు ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లాలో చెందిన ప్రస్తుత ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.