వినాయకుడి నిమజ్జనానికి భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. తిరుపతి మగళం రోడ్డు వినాయక సాగర్ వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు నేడు పరిశీలించారు.
తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించ కుండా COVID-19 నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఆయన కోరారు. అర్బన్ జిల్లా అంతటా స్థానిక వినాయక స్వామి వారి ఆలయాల వద్ద, వినాయక స్వామి విగ్రహాల మండపాలలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. నిమజ్జన ఘాట్ ల వద్ద గజ ఈతగాళ్లు ఉండేటట్లు ఏర్పాట్లు చేశారు.
స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్కాడ్,డాగ్ స్క్వాడ్ బృందాలచె విస్తృతంగా స్థానిక ఆలయాల వద్ద, మండపాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో యల్&ఓ అడిషనల్ యస్.పి అరిఫుల్లా, డి.యస్.పి ట్రాఫిక్ మల్లికార్జున, సి.ఐ.లు ఈస్ట్ శివప్రసాద్ రెడ్డి, అలిపిరి దేవేంద్ర, ట్రాఫిక్ హరిప్రసాద్ పాల్గొన్నారు.