కడప జిల్లా రాయచోటి వైసిపి నేత, మాజీ పిసిసి సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
విజయవాడలోని ఆయన నివాసంలో కలిసిన రాంప్రసాద్ రెడ్డి త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. కడప జిల్లా తోపాటు రాయచోటి రాజకీయ పరిస్థితుల పై రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబుకు వివరించారు.
టిడిపి కార్యకర్తల స్థితిగతుల ను రాంప్రసాద్ రెడ్డిని అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు.
రాయచోటి నియోజకవర్గంలో టిడిపి బలోపేతం కోసం అందరితో కలిసి తమ శక్తివంచనలేకుండా కృషి చేస్తానంటూ చంద్రబాబు కు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.