26.7 C
Hyderabad
May 3, 2024 08: 06 AM
Slider మహబూబ్ నగర్

ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

#journalist federation

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కస్తూరి శ్రీనివాస్ ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం కల్వకుర్తి పట్టణ కాంగ్రేస్ నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయడు కస్తూరి శ్రీనివాసులు తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శాలువా కప్పి పూలమాలలతో  ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసులు అతి చిన్న వయసులోనే జిల్లా స్థాయిలో జర్నలిస్టు సంఘానికి  అధ్యక్షుడిగా కావడం ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో  జర్నలిజం సంఘంలో  మరెన్నో ఉన్నత  పదవులు అధిరోహించాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయన కోరారు.

ఎంతోమంది పేదలకు జరిగిన అన్యాయాలను దోపిడీలను అభివృద్ధి కార్యక్రమాల వార్తలను పత్రికా ముఖంగా ప్రజలకు చేరవేసి అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఆర్థిక  స్వలాభం  లేని  జర్నలిజం వృత్తిని చేపట్టడం చాలా అభినందనీయమన్నారు.

నిజాన్ని నిగ్గు తేల్చి ప్రజల ముందు  ఉంచుతున్న అన్యాయాలను అక్రమాలను పత్రికాముఖంగా తెలిపితే వారి పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి స్వార్ధ రాజకీయ నాయకులు  భయ భ్రాంతులు గురి చేస్తున్న తరుణంలో జర్నలిజం వృత్తిలో కూడా జర్నలిజం సంఘాలు కూడా  అవసరమని  అన్నారు.  ఈ కార్యక్రమంలో శేఖర్ నాని నరసింహ దాయనంద్ ఆయుబ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సూసైడ్:ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య

Satyam NEWS

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

Satyam NEWS

తెలంగాణ లో పెరిగిన ద్రవ్యోల్బణం

Bhavani

Leave a Comment