సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు కెటిఆర్,మల్లారెడ్డి,జగదీశ్వరెడ్డి,సత్యవతి రాథోడ్ పర్యటనలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని,అనంతరం బహిరంగ సభ జరగనుందని శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
బుధవారం సభా స్థలిని పరిశీలించిన అనంతరం శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈనెల 29న,యువ నాయకుడు మంత్రి కెటిఆర్ పర్యటన విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంత్రి కెటిఆర్ తో పాటు మల్లారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్వరెడ్డి,సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారని తెలిపారు. హుజూర్ నగర్ నియోజవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుందని,గిరిజనులకు నియోజకవర్గ కేంద్రంలో గిరిజన బంజారా భవనం,రైతు వేదికలు,లిఫ్ట్ ఇరిగేషన్ పలు అభివృద్ధి కార్యక్రమలు,నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం,పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని సైదిరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్