28.7 C
Hyderabad
April 28, 2024 05: 24 AM
Slider ముఖ్యంశాలు

మానసిక,శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా

#yogaday

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ విభాగాలు I, II ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక,శారీరక ఆరోగ్యం పెంపొందుతుంది అని అన్నారు.యోగా వల్ల మనిషి తనలోని ఒత్తిడిని జయించ వచ్చని,నేటి ఆధునిక యుగంలో కలిగే అనేక మానసిక,శారీరక రుగ్మతలకు యోగా సరియైన మందు అని,యోగా వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు.యోగా దినోత్సవ సందర్భంగా కళాశాలలో ప్రాణాయామం,కొన్ని యోగాసనాలను విద్యార్థులకు నేర్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చందా అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి ఎస్. శ్రీనివాస రావు,డాక్టర్ డి.నగేష్,బి.సైదిరెడ్డి, పి.నాగరాజు,నాగార్జున,వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ,రవికుమార్,అధ్యాపకేతర బృందం,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మంత్రి పువ్వాడకు బ్రాహ్మణ సంఘం మద్దతు

Bhavani

టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

Satyam NEWS

పాకిస్తాన్ బయటపడేందుకు మార్గం కూడా ఉన్నది….

Satyam NEWS

Leave a Comment