39.2 C
Hyderabad
April 28, 2024 12: 05 PM
Slider నల్గొండ

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

#cituc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మిక దినోత్సవం మేడే పండుగ సందర్భంగా మే 1న,ఆదివారం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పత్రిక విలేకరులకు తెలియజేశారు. 

సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులకు మేడే కరపత్రాలను శనివారం పంచారు.అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ర్యాలీ,బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మేడే ఉత్సవాల్లో   పాల్గొంటున్నట్లు తెలిపారు.సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు,ఉద్యోగులు,అభిమానులు ర్యాలీ,బహిరంగ సభలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో యల్క సోమయ్య గౌడ్,నేపాల్,రాకేష్,శ్యామ్, నాగేశ్వరరావు,వెంకన్న,నాగరాజు, సైదులు, లక్ష్మయ్య, యల్లయ్య,కార్మిక సంఘాల నేతలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

సీపీఎస్‌ రద్దు హామీ: 7 రోజులన్నారు..765 రోజులైంది

Satyam NEWS

గృహలక్ష్మికి మూడు రోజులు మాత్రమే… మద్యం దుకాణాలకు ఇరవై రోజుల గడువా..?

Satyam NEWS

లిక్కర్ కేసు దారి మళ్లించేందుకే కవిత దొంగ దీక్ష

Bhavani

Leave a Comment