సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మిక దినోత్సవం మేడే పండుగ సందర్భంగా మే 1న,ఆదివారం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పత్రిక విలేకరులకు తెలియజేశారు.
సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులకు మేడే కరపత్రాలను శనివారం పంచారు.అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ర్యాలీ,బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మేడే ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు,ఉద్యోగులు,అభిమానులు ర్యాలీ,బహిరంగ సభలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యల్క సోమయ్య గౌడ్,నేపాల్,రాకేష్,శ్యామ్, నాగేశ్వరరావు,వెంకన్న,నాగరాజు, సైదులు, లక్ష్మయ్య, యల్లయ్య,కార్మిక సంఘాల నేతలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, హుజూర్ నగర్