ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్ యుటిఎఫ్ బలపరిచిన మాణిక్ రెడ్డి ని గెలిపించుకుందామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలక్కపల్లి మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని గెలిపించుకుందామని సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మాణిక్ రెడ్డి ఎన్నో పోరాటాలు నిర్వహించారనీ, ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక అని ,ఎటువంటి ప్రలోభాలకు లొంగని నాయకుడన్నారు. శాసనమండలి వేదికగా ఉపాధ్యాయుల పక్షాన నిలబడే మాణిక్ రెడ్డిని గెలిపించుకుందామని ఉపాధ్యాయులను జంగయ్య కోరారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ శర్మ, జిల్లా కార్యదర్శులు నాగపూర్ చంద్రశేఖర్, మహేష్ బాబు, మండల నాయకులు ఆంజనేయులు, లక్ష్మీపతి, మహేష్, నరేష్,మల్లేష్ ,రాములు ,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
previous post