రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలని రెడ్డి కులస్తులకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంలో నేడు రెడ్డి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో మల్లు రవి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్లందరూ కలిసికట్టుగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్ధించాలని కోరారు. ఆది నుంచి వారు బాగుండి 10 మంది బాగుపడాలని రెడ్లు కోరుకుంటారని ఆయన అన్నారు. రెడ్లకు మొదటి వృత్తి వ్యవసాయం కాగా రెండవ ప్రధాన వృత్తి రాజకీయాలు. రెడ్లు రాజకీయాలతో నడుస్తారు నడిపిస్తారు అని ఆయన అన్నారు.
previous post