రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన లక్ష రూపాయల లోపు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రుణమాఫీ, జి. ఓ. 58, 59, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, నివాస స్థలాల పట్టాల పంపిణీ, గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం, తెలంగాణకు హరితహారం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రుణమాఫీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.