మొత్తం జనాభాలో మహిళలు యాభై శాతం ఉన్నారు. అందరు కలిసి బిజెపి పార్టీ అధికారం లోకి తీసుకురావాలని రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు డాక్టర్ మాలతి అన్నారు. ఈరోజు గద్వాల పట్టణంలోని డికె.బంగ్లాలో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణ వేణి జిల్లా కార్యవర్గ సమావేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు డాక్టర్ మాలతి హాజరై మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2015లో భేటి బచావో బేటీ పడావో కార్యక్రమం తీసుకు రావడం జరిగింది.
అటల్జీ జీవితాంతం మహిళలు, సమాజంలోని నిర్లక్ష్యానికి గురైన వర్గాల కోసం పనిచేయాలనే లక్ష్యంతో పనిచేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణ రెడ్డి, రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, కౌన్సిలర్లు రజక జయశ్రీ, కబీర్ దాస్ అనిత, జిల్లా మహిళ మోర్చా ప్రదాన కార్యదర్శి సమత ,మండల మహిళ నాయకురాలు తదితరులు ఉన్నారు.