అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి దాచుకున్న డబ్బును కరోనా కష్టకాలంలో విరాళంగా ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారు సావిత్రి. ఆంధ్రా యూనివర్సిటీలో క్లర్కుగా పని చేసిన సావిత్రి పదవీ విరమణ చేశారు. ప్రతిరోజూ విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి, దాన్ని అదుపు చేయడానికి పోలీసులు పడుతున్న తపన గురించి వింటూ ఉన్న సావిత్రి తాను బంగారం కొనడం ముఖ్యం కాదని, ఆపదలో ఉన్న పోలీసులకు సహాయం చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె 50,000 రూపాయల చెక్కును విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు అందచేశారు.
previous post