అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం తుళ్లూరు శిబిరం వద్ద రాజధాని రైతులు బైఠాయించి నిరసనకు దిగారు.
రాత్రి 11 గంటలకు కూడా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహాధర్నా కార్యక్రమం జరుగుతున్నది. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు 355వ రోజుకు చేరాయి.
అలాగే తులసి థియేటర్ సెంటర్ వద్ద అష్టదిగ్భంధనం చేసి ధర్నా చేపట్టారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.