వికారాబాద్ జిల్లా పాత తాండూరులో వెలసిన శ్రీ భవాని మాత ఆలయంలో జాతర ఉత్సవాలు ఆదివారం ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషాలతో ,భక్తి శ్రద్ధలతో వాడవాడలా భవాని మాతకు బోనాలతో ,పోతరాజు విన్యాసాలతో, డప్పు వాయిద్యాలతో అమ్మవారికి నైవేద్యంగా భక్తులు సమర్పించారు.
దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సిములు బోనంతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాలకు తాండూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలతోపాటు మహబూబ్ నగర్, వికారాబాద్, చించొలి, సెడెం, అయ్యాలం, చితాపూర్, కురుకుంట తదితర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
జాతర ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఎర్రం శ్రీధర్, ఆనంతయ్య , వెంకట్, వాణిశ్రీ, శారదా, శ్రీ కౌసల్య, ఆకాంక్ష, శారదా, సుజాత, మహాదేవి, శకుంతల, జ్యోతి , లక్ష్మి, మోముల లక్ష్మీ వెంకటయ్య, పద్మ, పార్వతి, మున్నూర్ శ్రీనివాస్,మనోహర్, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.