డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం పేద ప్రజలు, దళితుల అభివృద్ధి కోసం పోరాటం చేశారని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంగళవారం తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా సీపీఐ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కంచర్ల కాశయ్య మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య, సినియర్ నాయకులు మునగాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
previous post