భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఆయన 129వ జయంతి సందర్భంగా గుర్తుచేసుకోవడం మన కర్తవ్యమని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ సమన్వయ కర్త (తెలంగాణ రాష్ట్రం) నూనె బాల్ రాజ్ తెలిపారు.
సమాజంలోని అట్టడుగు వర్గం నుంచి వచ్చి సమాజంలోని అత్యున్నత స్థాయికి చేరిన డాక్టర్ అంబేద్కర్ నేటి యువతరానికి ఆదర్శనీయుడని ఆయన అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నూనె బాల్ రాజ్ పుష్పాంజలి ఘటించారు.
జ్యోతిబా పూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం లాంటి దళిత నాయకులు కుల వివక్షపైనా నిరక్షరాశ్యత పైనా ఎనలేని పోరాటాలు జరిపారని బాల్ రాజ్ గుర్తు చేశారు. ఆనాటి వారి పోరాట ఫలితమే నేటి ఆధునిక భారత దేశమని ఆయన అన్నారు. దేశం మొత్తం కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న ఈ సమయంలో వారు చూపిన చొరవను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక దూరం కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు కరోనాపై పోరాటం చేయాలని నూనె బాల్ రాజ్ పిలుపునిచ్చారు.